News October 8, 2025
పార్టీ మారినా ఎమ్మెల్సీ పద్మశ్రీకి దక్కని ప్రాధాన్యత!

కాకినాడ: ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన MLC కర్రి పద్మశ్రీని అవమానాలు వెంటాడుతున్నాయి. అందరూ ఎమ్మెల్సీలను పిలుస్తున్నా.. ఇంతవరకు ఆమెను మాత్రం జడ్పీ సర్వసభ్య సమావేశానికి పిలవలేదట. గతంలో YCPలో ఉన్నప్పుడూ ప్రాధాన్యత దక్కలేదని ఆమె అనుచరులు వాపోతున్నారు. నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీని ఎదగనివ్వలేదంటున్నారు. ఇప్పుడు TDPలో చేరగా MLA కొండబాబు సైతం పద్మశ్రీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
Similar News
News January 23, 2026
ఈ నెల 29న విడుదల కానున్న విజయనగరం జిల్లా మత్స్యకారులు

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.
News January 23, 2026
HYDలో ఇదో అంతుచిక్కని మొక్క!

గ్రేటర్ పరిధి చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్క అంతుచిక్కని సమస్యగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నో పైలట్ ప్రాజెక్టులు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టినా ఫలితం లేదు. ఉప్పల్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో గుర్రపు డెక్కను పూర్తిగా చంపేందుకు అంతర్జాతీయ నిపుణులతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా ఫలితం రాలేదు. చెరువుల్లో అతిపెద్ద సమస్యగా మారిన గుర్రపుడెక్కను అంతంచేసే పరిష్కారమే లేదా? అని అడుగుతున్నారు.
News January 23, 2026
HYDలో ఇదో అంతుచిక్కని మొక్క!

గ్రేటర్ పరిధి చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్క అంతుచిక్కని సమస్యగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నో పైలట్ ప్రాజెక్టులు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టినా ఫలితం లేదు. ఉప్పల్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో గుర్రపు డెక్కను పూర్తిగా చంపేందుకు అంతర్జాతీయ నిపుణులతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా ఫలితం రాలేదు. చెరువుల్లో అతిపెద్ద సమస్యగా మారిన గుర్రపుడెక్కను అంతంచేసే పరిష్కారమే లేదా? అని అడుగుతున్నారు.


