News December 1, 2025
పార్లమెంట్ సమావేశాలు.. బండి సంజయ్ గొంతెత్తుతారా? లేదా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. KNR పార్లమెంట్ స్థానానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడంపై బండి సంజయ్ మాట్లాడితే BJPకి ఎంతోకొంత మేలు జరగనుంది. ఇక జిల్లాలో ఇసుక మాఫియా వల్ల చెక్ డ్యాంలకు జరుగుతున్న నష్టం, కూల్చివేత అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అంతా కోరుతున్నారు.
Similar News
News February 7, 2026
RCB విజయం.. మంధాన తల్లి పోస్ట్ వైరల్

WPL ఫైనల్లో <<19062605>>RCB ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్మృతి మంధాన తల్లి స్మితకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్మృతి బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ బౌలర్లలో ఆమె తన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్ను ఊహించుకున్నారనే మీమ్ను ఇన్స్టాలో రీపోస్ట్ చేశారు. దీనిపై ‘సూపర్ ఆంటీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్క్రీన్షాట్లు వైరల్ కావడంతో కాసేపటికే ఆమె ఆ పోస్టును తొలగించారు.
News February 7, 2026
సిద్దిపేట: డేంజర్.. జిల్లాలోకి పెద్దపులి ఎంటర్

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్వో లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 7, 2026
చిత్తూరు: ఏనుగుల దాడులకు ‘హనుమాన్’తో చెక్.!

రామకుప్పం(M)లో ఏనుగు ధాటికి పాడి <<19074524>>ఆవు<<>> మృతి చెందగా, GDనెల్లూరు నియోజకవర్గంలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. HANUMAN ప్రాజెక్ట్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటు చేస్తారు. వెటర్నరీ అసిస్టెంట్, శిక్షణ పొందిన రక్షణ సిబ్బంది, డ్రైవర్, ఆధునిక వాహనాలు, ట్రాంక్విలైజేషన్ పరికరాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. జంతువులు నివాస ప్రాంతాల్లోకి వెళ్లగానే ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.


