News November 19, 2025

పార్వతీపురంలో ఈనెల 28న ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్‌

image

ఈనెల 28వ తేదీ శుక్ర‌వారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈనెల 28న క‌లెక్ట‌ర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గంటలకు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. స‌మ‌స్య‌ల‌ను ఈ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

PhonePe రూ.5వేల గిఫ్ట్.. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

image

సంక్రాంతి వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ లింక్ వైరల్‌గా మారింది. ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్- అన్ని వినియోగదారులకు రూ.5000’ అంటూ ఓ లింక్‌ షేర్ అవుతోంది. యూజర్లను టెంప్ట్ చేసేలా ఉన్న ఈ లింక్ ఓపెన్ చేస్తే ‘404’ అని వస్తోంది. కాగా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులకు ఆశపడి లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News January 15, 2026

తిరుపతి: ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు…?

image

TTD, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ప్రజలు భూ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో శేషసాయి నగర్‌లో ఉన్న భూములను 22A క్రింద తీసుకొచ్చారు. దీంతో ఈ ల్యాండ్స్ లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు రాకుండా నిలిచిపోయాయి. 22A నిబంధనలు, IDT క్లెయిమ్స్ వల్ల చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను అనుభవించలేక, వేరొకరికి అమ్మలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

News January 15, 2026

నెల్లూరు: ‘నాకు రూ.5 వేలు వచ్చాయి’ అంటూ మెసేజ్ వచ్చిందా..

image

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని చేజర్ల ఎస్సై తిరుమలరావు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు.