News November 19, 2025

పార్వతీపురంలో యాక్సిడెంట్.. టీచర్ మృతి

image

పార్వతీపురం-నర్సిపురం మధ్యలో ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. నర్సిపురం హైస్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోన్న మరిశర్ల వెంకటనాయుడు విధుల నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగుల్లో ఉన్న అతనిని తోటి వాహనదారులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 18, 2026

అన్నప్రసాదంపై దుష్ప్రచారం వద్దు: భద్రాద్రి ఈఓ

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి అన్నప్రసాద వితరణపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆలయ ఈఓ దామోదర్ రావు కోరారు. ఆదివారం అన్నదాన సత్రాన్ని తనిఖీ చేసి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులందరికీ అన్నప్రసాదం అందుతోందని, ఆలయ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెట్టడం సరికాదని హితవు పలికారు. నిరాధారమైన ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 18, 2026

చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

image

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.

News January 18, 2026

చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

image

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.