News December 2, 2025
పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.
Similar News
News February 13, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 13, 2026
పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎస్

రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ విజయానంద్ శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొన్నారు.
News February 13, 2026
‘వారణాసి’ జానర్పై క్లారిటీ

వారణాసి సినిమా జానర్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కాదని.. మైథలాజికల్ ఫాంటసీ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రన్టైమ్ 3 గంటలకు కాస్త తక్కువ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని.. మిగిలిన దాన్ని జూన్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్పై ఫోకస్ పెడతామని పేర్కొన్నారు.


