News February 27, 2025

పార్వతీపురం జిల్లాలో 93.94% పోలింగ్ నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 4 గంటల వరకు 93.94% పోలింగ్ శాతం నమోదైంది. ఈ మెరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 2187 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News February 28, 2025

సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాలి: విశాఖ జేసీ

image

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా అందే సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో వారితో స‌మావేశ‌మైన ఆయ‌న వివిధ అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్, రేష‌న్ బియ్యం పంపిణీ, తూనిక‌లు, కొల‌తలు ఇత‌ర ప్ర‌మాణాలు పాటించే క్ర‌మంలో జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని చెప్పారు.

News February 28, 2025

వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

News February 28, 2025

జిల్లాలో రాయపర్తిలోనే తక్కువ పోలింగ్

image

రాయపర్తి మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వరంగల్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రాయపర్తి మండలంలో 66మంది ఓటర్లుండగా.. 60 మంది టీచర్లు ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 90.90శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కువగా సంగెం మండలంలో 98.48శాతం నమోదైంది.

error: Content is protected !!