News October 5, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో గున్న ఏనుగు మృతి

image

పార్వతీపురం(M) లక్ష్మీనారాయణపురంలో సంచరిస్తున్న 9 ఏనుగుల గుంపులో ఒక పిల్ల ఏనుగు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. గ్రామ సమీపంలోని ముదిరాజ్ చెరువులో 9 ఏనుగులు స్నానానికి దిగగా ఇటీవలే జన్మించిన గున్న ఏనుగు బురదలో కూరుకుపోయి మరణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు అటవీ అధికారులు తెలియచేస్తున్నారు. పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని అటవీరేంజ్ అధికారి మణికంటేశ్ తెలియజేశారు.

Similar News

News January 18, 2026

T20 WC టీమ్‌లో ప్లేస్ మిస్.. స్పందించిన సిరాజ్

image

T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి మౌనం వీడారు. ‘నేను గత T20 ప్రపంచకప్‌లో ఆడాను. ఈసారి ఆడటం లేదు. ఒక ప్లేయర్‌కు ప్రపంచకప్‌లో ఆడటం అనేది ఒక కల. దేశం కోసం ఆడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగుంది. మంచి ఫామ్‌లో ఉంది. వారికి నా విషెస్. ట్రోఫీ గెలవాలి’ అని అన్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ లేకపోవడంపై వర్క్‌లోడ్ మ్యానేజ్‌మెంటే కారణమని వివరించారు.

News January 18, 2026

మంచిర్యాల: రేపటి ‘ప్రజావాణి’ రద్దు

image

మున్సిపల్ ఎన్నికల విధులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పరిపాలనా పరమైన పనుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 18, 2026

VZM: కలెక్టరేట్‌లో రేపు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.