News November 8, 2025

పావలా వడ్డీకే రుణాలు: తిరుపతి కలెక్టర్

image

KVBపురం(M)లో రాయల చెరువు తెగి ఐదు ఊర్లు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద ధాటికి 57 మూగ జీవులు(26 ఆవులు, 18 గేదెలు, 13 గొర్రెలు) చనిపోయినట్లు సమాచారం. కొట్టుకుపోయిన జీవాలు కొన్ని ఇంటి బాట పట్టాయి. పశువులను కోల్పోయిన వారిని నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారన్నారు.

Similar News

News January 16, 2026

చిత్తూరు: అసభ్యకర పోస్టులపై విచారణ

image

సమాచార శాఖ.కుప్పం అధికారిక వాట్సాప్ గ్రూపులో <<18869391>>అసభ్యకర వీడియోలు <<>>కలకలం రేపాయి. ఇదే అంశంపై Way2Newsలో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం RDO, I&PR అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు.

News January 16, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.

News January 16, 2026

కృష్ణా: ORR అభ్యంతరాలకు నేడే లాస్ట్ డేట్.. రైతుల్లో ఉత్కంఠ!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అభ్యంతరాల గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కృష్ణా జిల్లాలోని పామర్రు, పెనమలూరు, గన్నవరం పరిధిలో 189.4 కి.మీ మేర 6 వరుసల రహదారి కోసం కేంద్రం గెజిట్ విడుదల చేసింది. రూ. 16,310 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుపై రైతులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు నేడే ఆఖరి అవకాశం.