News August 21, 2025
పిఠాపురం: కొత్త జంటకు తప్పని వరద కష్టాలు

కొత్తగా పెళ్లైన జంటను వరద కష్టాలు వెంటాడాయి. గొల్లప్రోలు కొత్త కాలనీకి చెందిన అపర్ణాదేవికి విశాఖ వాసి పార్థసారథితో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున వివాహమైంది. అత్తవారింటికి వచ్చేందుకు కొత్త జంట గొల్లప్రోలు చేరుకుంది. అయితే వరద నీరు అడ్డంకిగా మారింది. సుద్దగెడ్డ కాలువపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిచ్చెన ఎక్కి వంతెన దాటి కాలనీకి చేరుకోవాల్సి వచ్చింది.
Similar News
News January 24, 2026
14.6 డిగ్రీలకు పడిపోయిన పటాన్చెరు ఉష్ణోగ్రత

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం జిన్నారంలో 16.0°, గుమ్మడిదలలో 17.9°, అమీన్పూర్లో 18.8°, రామచంద్రాపురంలో 18.7°, పటాన్చెరులో 14.6° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం 88.4%గా ఉంది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
News January 24, 2026
అనకాపల్లి మీదుగా విశాఖ చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

అనకాపల్లి మీదుగా విశాఖ-చర్లపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదున్నర గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం చర్లపల్లి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 26 మధ్యాహ్నం 3:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు. దీనికి అనకాపల్లిలో హాల్ట్ సౌకర్యం ఉందన్నారు.
News January 24, 2026
IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<


