News February 6, 2025

పిల్లల్ని నేనే చదివిస్తా.. ఏలూరు జిల్లా కలెక్టర్ హామీ

image

జంగారెడ్డిగూడెంలో చిన్నారులపై మారు తండ్రి జరిపిన పాశవిక దాడి చూసి  జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చలించిపోయారు. వారికి విద్య, వైద్యం, అందించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం ఏలూరుకు తీసుకువచ్చిన బాధిత పిల్లలను అక్కున చేర్చుకుని వారిలో మనోధైర్యం నింపే విధంగా మాట్లాడారు. ఏది అవసరమైన అన్ని తాను చూస్తానని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే బాధిత పిల్లలకు పలువురు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.

Similar News

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.

News March 14, 2026

GNT: జాతీయ లోక్ అదాలత్.. 24,756 కేసులు క్లియర్

image

గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 24,756 కేసులు పరిష్కరించబడినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ నాగరాజా తెలిపారు. 1,694 సివిల్ కేసులు, 22,983 క్రిమినల్ కేసులు, 79 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద భీమా, చెక్ బౌన్స్ కేసుల్లో పరిష్కరమైన కేసుల మొత్తం విలువ సుమారు రూ.42.58 కోట్లుగా ఉందన్నారు.

News March 14, 2026

తానూర్‌లో దొంగల బీభత్సం

image

తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్సై షేక్ జుబేర్ వివరాల ప్రకారం.. అర్జాపూర్ గంగాధర్ కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి రూ.79 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా రూ.1000 నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు.