News April 26, 2024

పి.గన్నవరంలో 29న జగన్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

image

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీన పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం రాజోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పరిశీలించారు. కేంద్ర కార్యాలయ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, పార్టీ నేత కేఎస్ఎన్ రాజు, వైసీపీ ప్రధాన కార్యదర్శి తెన్నేటి కిషోర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

Similar News

News April 14, 2026

సీతానగరం: రోడ్డు ప్రమాదం.. లిఫ్ట్ అడిగిన మహిళ మృతి

image

కోరుకొండ(M) నరసాపురానికి చెందిన నొక్కి వెంకటలక్ష్మి(37) అన్నదేవరపేట వెళ్లేందుకు యేసు బైక్‌పై లిఫ్ట్ అడిగింది. సీతానగరం(M) వంగలపూడి శివారులో వెళ్తుండగా ట్రక్కు అడ్డు రావడంతో యేసు సడన్ బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వెనుక కూర్చున్న వెంకటలక్ష్మి అదుపుతప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News April 12, 2026

రాజమండ్రి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌పై డెడ్ బాడీ..!

image

రాజమండ్రి రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై శనివారం సుమారు 64 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు గోధుమ రంగు టీషర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ‘మావూరి అప్పారావు, తండ్రి వీరన్న’ అని ఉన్న ఆసుపత్రి చీటి లభించింది. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నంబరును సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై.వి. రమణ కోరారు.

News April 10, 2026

రాజమండ్రి ప్రజలకు గుడ్‌న్యూస్

image

రాజమండ్రి విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీని పెంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజమండ్రిని రవాణా పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.