News April 5, 2024
పీవీ సొంతూరు రహదారి ఎలా ఉందంటే..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన HNK జిల్లా వంగరలో గ్రామ చెరువు నిండి అలుగు పారుతూ రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. అయితే గతంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పినప్పటికీ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మంత్రులు చొరవ తీసుకుని వంతెన నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.
Similar News
News January 24, 2025
నేడు కరీంనగర్కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్ని సందర్శిస్తారు.
News January 23, 2025
UGCముసాయిదా పై చర్చించిన మాజీ ఎంపీ
విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి UGC ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో BRS నేతల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. UGC ముసాయిదా అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు.
News January 23, 2025
పోచంపల్లి: డివైడర్ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వరాల రవి కుటుంబం కారులో వెళుతుండగా పోచంపల్లి వద్ద డివైడర్కు ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న108 వాహన సిబ్బంది గాయాలపాలైన నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.