News November 19, 2025
పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత బాబా గౌరవార్థం స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తారు. <<18326817>>100<<>> ఆవులను రైతులకు పంపిణీ చేస్తారు. హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో పాల్గొని ప్రసంగిస్తారు.
Similar News
News January 22, 2026
నిర్మల్: పుర పోరు.. సీఎం స్పెషల్ ఫోకస్

నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాల్లో BJPని నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నిర్మల్ సభ వేదికగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగించి కేడర్లో ఉత్సాహం నింపారు.
News January 22, 2026
వేల్పూర్: కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదం.. మూడేళ్ల బాలుడి మృతి

వేల్పూర్ మండలం మోతేలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెర్కిట్కి చెందిన దావుల ఎహెన్స్ (3) తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటుండగా కారు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ తీశాడు. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. ఆర్మూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News January 22, 2026
HYD: ఇంటి వద్దే FIR.. ఈ కేసులకు మాత్రమే వర్తింపు

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.


