News November 19, 2025
పుట్టపర్తిలో ప్రధాని మోదీకి విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం

సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనను ఆప్యాయంగా పలకరించారు. మోదీ పుట్టపర్తికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీర్వాదాలు ప్రధానికి ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 20, 2026
జగిత్యాల: కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జగిత్యాల జిల్లాలో జరగనున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో భద్రత, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూములు, బ్యారికేడ్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
News January 20, 2026
సిరిసిల్ల: ‘మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి’

పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
News January 20, 2026
వేములవాడ : ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వేములవాడ ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం తెల్లవారుజామున ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, టికెట్ తీసుకుని ప్రయాణిoచే భాద్యత ప్రయాణికులకే ఉండే విధంగా చూడాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు అన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.


