News November 20, 2025
పుత్తూరు: తినడానికి డబ్బులు ఇవ్వలేదని హత్య

పుత్తూరు మండలంలో నిన్న <<18329879>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. పుత్తూరు శివజ్యోతినగర్కు చెందిన రామ్మూర్తిరెడ్డి(55) తన భార్యకు రోటీలు తీసుకోవడానికి దాబాకు వచ్చాడు. బైకుపై తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి క్రాస్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకునే రవి అడ్డుకుని భోజనానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఈక్రమంలో గొడవ జరిగింది. రవి తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడవడంతో చనిపోయాడు. స్థానికులు రవిని పోలీసులకు అప్పగించారు.
Similar News
News January 23, 2026
RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.
News January 23, 2026
మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.
News January 23, 2026
రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ADB జిల్లాకు కాంస్య పతకం

నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులతోపాటు కోచ్ కోట యాదగిరిని ఎస్జీఎఫ్ సెక్రటరీలు వెంకటేశ్, యాకుబ్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.


