News February 7, 2025
పులివెందుల: రాజహంస వాహనంపై శ్రీనివాసుడు

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రాజ హంస వాహనంపై సరస్వతీ రూపంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 18, 2026
వైవీయూ మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో MOU

యోగి వేమన యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ బెంగళూరు మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో మధ్య మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) కుదుర్చుకున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్ ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్ బస్ ఇండియా సంస్థ తరఫున శేఖర్ బాబు వైవీయూ ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాస్, ప్రొ. విజయ భారతి సంతకాలు చేశారు.
News February 18, 2026
మార్చి 11న వైవీయూ కాన్వకేషన్ నిర్వహణ: వీసీ

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.
News February 18, 2026
ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు: కలెక్టర్

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని, రబీ సీజన్కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,875గా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ సాగు జరిగిందని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా MSP ధరకు విక్రయించాలన్నారు. పులివెందుల, తొండూరు, JMD, ముద్దనూరు, కమలాపురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు.


