News November 8, 2025
పెందుర్తి: అత్తను చంపి ఫైర్ యాక్సిడెంట్గా కథ అల్లిన కోడలు

పెందుర్తి పీఎస్ పరిధిలో కనకమహాలక్ష్మి అనే మహిళ అగ్ని ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. దేవుడి గదిలో దీపం పడి మంటలు చెలరేగడంతో తన అత్త చనిపోయినట్లు కోడలు లలితా దేవి పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా.. పాత గొడవలతో కోడలే అత్తను చంపి ప్రమాదంలో చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసినట్లు తేలిందని సీఐ సతీష్ కుమార్ శనివారం తెలిపారు.
Similar News
News January 22, 2026
విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.
News January 22, 2026
తిరుపతి: ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ ప్రారంభం

తిరుపతి జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరుపతి సిటీ కోఆర్డినేటర్ టి.కైలాష్ నాథ్ మాట్లాడుతూ.. రెండు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగినట్లు చెప్పారు. తొలిరోజు 2,107 మందికి 2,028 మంది హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్ష ముగిసింది.
News January 22, 2026
TU: మొదటి రోజు పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో B.Ed, B.P.Ed,LLB,LLM 1,3 సెమిస్టర్ల, PG ఇంటిగ్రేటెడ్(APE/PCH), IMBA 3,5 రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జరిగిన B.Ed, B.P.Ed పరీక్షలకు 2,798 విద్యార్థులకు 2,721 మంది హాజరు కాగా, ఇంటిగ్రేటెడ్(APE/PCH),IMBA పరీక్షలకు 230 కి 217 మంది హాజరయ్యారన్నారు. 90 మంది గైర్హాజరయ్యారు.


