News October 7, 2025
పెదబయలు: సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్

పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్ లేక పంచాయతీ పరిధి 23 గ్రామాల గిరిజనులు 2 వేల మంది ఈకేవైసీ, ఆధార్ అనుసందనం, ఉద్యోగులు ముఖ హాజరు కోసం పడరాని పాట్లు పడుతున్నారని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటుచేసి గిరిజనుల సెల్ సిగ్నల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
Similar News
News January 17, 2026
జిల్లాలో 5 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం: కలెక్టర్

ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో జిల్లాలో 5 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శనివారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నీతి ఆయోగ్ రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాకు ఈ కేంద్రాన్ని మంజూరు చేసిందని వెల్లడించారు. మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News January 17, 2026
కరీంనగర్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

KNR కార్పొరేషన్ 66 వార్డుల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ జనరల్: 28
ఎస్సీ మహిళ: 27, 30, 53
ఎస్సీ జనరల్: 4, 20, 25, 29
బీసీ మహిళ: 1, 5, 17, 33, 35, 43, 45, 47, 48, 54, 62, 64
బీసీ జనరల్: 10, 14, 31, 32, 34, 36, 37, 39, 46, 58, 59, 61, 63
జనరల్ మహిళ: 3, 7, 9, 11, 12, 13, 15,19, 38, 40, 41, 44, 49, 52, 55, 56, 57, 60
జనరల్: 2, 6, 8, 16, 18, 21, 22, 23, 24, 26, 42, 50, 51, 65, 66
News January 17, 2026
₹16 లక్షల కోట్లకు చేరనున్న రిటైల్ వస్త్ర వ్యాపారం

దేశంలో రిటైల్ వస్త్ర వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2029-30 నాటికి ₹16 లక్షల కోట్లకు విస్తరించనుందని ‘కేర్ ఎడ్జ్’ అంచనా వేసింది. ‘ప్రస్తుతం 9.30 లక్షల కోట్లతో 41% శాతం వాటా రిటైల్ వ్యాపారానిదే. బ్రాండెడ్ దుస్తులకు ప్రాధాన్యం పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో మరో 13% పెరగనుంది. టైర్2, 3 పట్టణాల్లో ఈ కామర్స్ సహా, జుడియో, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ యోస్టా వంటివి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.


