News March 5, 2025

పెద్దపల్లి: ఇంటర్ మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి అన్నారు. ఈ పరీక్షకు (5341) మంది హాజరుకావాల్సి ఉండగా, (5154)మంది హాజరు కాగా (187) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. తొలి రోజు 96 % హాజరు నమోదయ్యిందన్నారు.

Similar News

News January 25, 2026

ఇవాళ నాన్ వెజ్ తినకండి! ఎందుకంటే..

image

వారంలో కొన్ని రోజులు కొందరు దేవుళ్ల పేరిట నియమాలు పాటించి సండే ఏ రూల్ పెట్టుకోం. కానీ లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి రోజైన ఆదివారం మాంసం జోలికి పోకూడదట. సూర్యాష్టక శ్లోకం ‘స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే| న వ్యాధి శోక దారిద్య్రం సూర్యలోక స గచ్ఛతి’ ప్రకారం.. ఆదివారం స్త్రీ సాంగత్యం, తల నూనె, మద్యం, మాంసం తాకలేదంటే దారిద్ర్య విముక్తి, సూర్యలోక ప్రాప్తి. ఈరోజు సూర్య జయంతి-రథ సప్తమి.

News January 25, 2026

పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి

image

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్’ పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే ఇది చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 25, 2026

రంగారెడ్డి జిల్లాలో భారీగా పెరిగిన జనాభా

image

రంగారెడ్డి జిల్లా ఓటర్ల జాబితాలో ముందుంది. 2011 సెన్సస్ ప్రకారం 24,46,265 మంది ఉండగా.. 2024కి భారీగా పెరిగింది. 8 నియోజకవర్గాల పరిధిలో 18 ఏళ్లుపైబడిన వారు 35,23,219 మంది ఉన్నారు. 526 పంచాయితీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా.. చేవెళ్ల, మొయినాబాద్, కొత్తూరు, షాద్‌నగర్, శంకర్‌పల్లి, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా.
నేడు జాతీయ ఓటరు దినోత్సవం