News January 29, 2025
పెద్దపల్లి: జనవరి 31న వాహనాలకు వేలం

జనవరి 31వ తేదీన వివిధ కేసుల్లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలకు వేలం వేయనున్నట్లు పెద్దపల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు అదేరోజు 10 గంటలకు రుసుము చెల్లించి రసీదు తీసుకోవాలని సూచించారు.
Similar News
News February 14, 2025
ADB: MH మద్యం స్వాధీనం.. ఒకరి ARREST

జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పార్డి (బి)లో అక్రమంగా దేశీదారు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 46 దేశీదారు బాటిల్లు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. అక్రమంగా దేశీదారు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.