News March 10, 2025

పెద్దపల్లి జిల్లాకు రూ.200 కోట్లు..!

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి రూ.200కోట్లు మంజూరు చేశారు.

Similar News

News March 14, 2026

నాగర్‌కర్నూల్: ప్రభుత్వంపై పోరాటం చేస్తాం: నాగం

image

రైతులకు సాగునీరు,తాగునీరు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలుతీసుకోవాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌లో ఉన్న సుమారు మూడు కిలోమీటర్ల పనులను పూర్తి చేయకుంటే తన వయస్సును కూడా లెక్కచేయకుండా ప్రాజెక్టుల దగ్గర పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News March 14, 2026

రామన్నపేట: మార్చి 28 జాతీయ లోక్ అదాలత్

image

మారుమూల ప్రజలకు న్యాయం అందేలా వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన జడ్జి A.జయరాజు రామన్నపేట కోర్టులో మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు పరిష్కరించే విధానాలపై DLSA కార్యదర్శి V.మాధవిలత, రామన్నపేట Sr సివిల్ జడ్జి G.సబిత, ప్రిన్సిపల్ Jr సివిల్ జడ్జి S.శిరీష, 2nd క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి D.సత్తయ్యతో కలిసి చర్చించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.