News August 21, 2025
పెద్దపల్లి: మూడు రోజులపాటు ఆధార్ సవరణ క్యాంపులు

ఆగస్టు 21 నుంచి 23 వరకు ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాలు, పెద్దపల్లి, రామగుండం మున్సిపల్ కార్యాలయాలలో ఆధార్ సవరణ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆధార్ వివరాలు సరిచేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ లబ్ధిదారులు ఆధార్ అప్డేట్ చేసుకుని పోషణ్ ట్రాకర్ FRSలో 100% నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.
Similar News
News January 18, 2026
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News January 18, 2026
ముగిసిన సెలవులు.. గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సెలవులు ముగియడంతో గుంటూరులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన నగరాలకు వెళ్లే బస్సు, రైలు టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుంటూరు నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 18, 2026
జాతీయ స్థాయి కబడ్డీకి పాలమూరు విద్యార్థినులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-19 విభాగంలో జిల్లాకు చెందిన శివాని, భవాని, మౌనిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో రేపటి నుంచి జరిగే ఈ టోర్నీలో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాలమూరు క్రీడామణులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.


