News February 17, 2025

పెద్దపల్లి: రైలు కింద పడి మహిళ మృతి

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సోమవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వయస్సు 50 – 55 సంవత్సరాలు ఉండగా, ఎడమ చేతిపై జనగామ లక్ష్మి అని పచ్చబొట్టు ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8328512176, 9490871784 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News March 23, 2025

గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

image

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.

News March 23, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు 

image

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగే సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం 24వ తేది నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మార్పును జిల్లా వాసులు గమనించాలని ఆయన కోరారు. 

News March 23, 2025

హీరోయిన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ డేటింగ్?

image

సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్యతో దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల బ్రిగిడకు దగ్గరయ్యారని సినీ వర్గాలంటున్నాయి. ఈ పుకార్లపై వారు స్పందించాల్సి ఉంది. కాగా బ్రిగిడాతో శ్రీకాంత్ పెదకాపు-1 సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించిందని సమాచారం.

error: Content is protected !!