News February 17, 2025

పెద్దవడుగూరు: దేవుడా.. పిల్లాడిపై దయ చూపలేకపోయావా..!

image

ఆ కుటుంబమంతా సంతోషంగా గడిపి కొద్ది క్షణాలలో ఇంటికి చేరుకుంటాం అనుకున్న సమయంలో మృత్యువు చిన్నారి రిత్విక్‌(3)ను కబళించింది. దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డి భార్య, కుమారులతో కలిసి పెద్దపప్పూరు అశ్వర్థం బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి రిత్విక్‌ మృతి చెందాడు. దేవుడా పిల్లవాడి మీద అయినా దయ చూపలేకపోయావా అంటూ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Similar News

News March 14, 2026

మరి కాసేపట్లో గుత్తికొట ఉత్సవాలు ప్రారంభం

image

గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గుత్తి కోట ఉత్సవాలు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ప్రజలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేజ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.

News March 13, 2026

SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 13, 2026

అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

image

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.