News September 12, 2025
పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
మెదక్: ఈ ఆదివారం విందులకు సై..

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు, మొదటి రెండు విడతల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు నేడు పెద్ద ఎత్తున విందులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నేడు ఆదివారం అత్యంత కీలకంగా మారింది.
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్: కలెక్టర్

మెదక్ జిల్లాలో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎన్నికల కోడ్) అమల్లోనే ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకూ కోడ్ కొనసాగుతుందని తెలిపారు. ఏకగ్రీవంగా నిలిచిన గ్రామపంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ యథాతథంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 7, 2025
తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. బీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.


