News November 19, 2025
పెనాల్టీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మేయర్

అసెస్మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగర వాసులు, ఈ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా కౌన్సిల్ హాల్లో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News January 20, 2026
బాస్ ఈజ్ బ్యాక్.. MSVPGపై బన్నీ ప్రశంసలు!

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్.. స్క్రీన్పై వింటేజ్ వైబ్స్ చూడటం ఆనందంగా ఉంది. వెంకటేశ్ నటన, అనిల్ డైరెక్షన్, నయన్- కేథరిన్ పర్ఫార్మెన్స్ అదుర్స్. ఇది బ్లాక్ బస్టర్ కాదు.. బాస్-బస్టర్. నిర్మాత సుస్మిత కొణిదెల, సాంకేతిక బృందానికి శుభాకాంక్షలు. సంక్రాంతికి రావడం.. హిట్ కొట్టడం అనిల్కు ఆనవాయితీగా మారింది’ అని పేర్కొన్నారు.
News January 20, 2026
రేపు మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఆయా మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.
News January 20, 2026
లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.


