News July 11, 2024

పెళ్లి కాలేదని తాడిపత్రిలో యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కాలేదన్న మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. పుట్లూరు రైల్వే గేట్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై నాగప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పట్టణంలోని పాత కోటకు చెందిన నాగయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 18, 2025

JNTUతో MOU కుదుర్చుకున్న DBLNS కంపెనీ

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం DBLNS కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే లైవ్ ప్రాజెక్టులు, వర్క్ షాప్‌లు, తదితర అంశాలపై MOU కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర్, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్ సుజాత, ఈశ్వర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్, CSE విభాగాధిపతి భారతి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

News February 17, 2025

104ఏళ్ల బండయ్య మాస్టారుకు సన్మానం

image

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.

News February 17, 2025

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: కలెక్టర్

image

ఏ ఒక్క అర్జీదారుడు నిర్లక్ష్యానికి గురికాకుండా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్ శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన PHRS కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

error: Content is protected !!