News February 8, 2025
పేరూరు: తల్లి మృతితో పిల్లలు కన్నీరుమున్నీరు

అమలాపురం మండలం పేరూరు కంసాల కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం గుడాలకి చెందిన కవిత నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. భర్త సునీల్ నరసాపురంలో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు స్కూలుకు వెళ్లాక ఆమె ఫ్యాన్కు ఉరేసుకుంది. తల్లి మరణించడంతో పిల్లల రోదన స్థానికులను కలిచివేసింది. CI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 7, 2026
VZM: మార్చి 31లోగా ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కృష్ణ తేజ ఆదేశించారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉపాధి హామీ పనులపై కమీషనర్ సమీక్షించారు. తక్కువ పురోగతి ఉన్న గంట్యాడ, వేపాడ, గరివిడి, గజపతినగరం, జామి మండలాలు మార్చి 15లోగా పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
News February 7, 2026
KNR: ఎన్నికల వేళ.. ప్లకార్డుల తయారీతో ఆర్టిస్టులకు ఉపాధి

మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలోని ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరిట ఆర్టిస్టులు ప్లకార్డులు రూపొందిస్తున్నారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా కార్యకర్తలు చేతిలో పట్టుకునే విధంగా థర్మాకోల్ బోర్డుపై అభ్యర్థుల పేర్లను, గుర్తులను అందంగా రాస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆకర్షనీయంగా కనిపిస్తున్న ప్లకార్డుల తయారీతో ఆర్టిస్టులకు ఉపాధి పెరిగిందని చెప్పవచ్చు.
News February 7, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<


