News December 2, 2025
పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.
Similar News
News February 16, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వకు రెండు చెంచాల నూనె కలపండి. * క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది. * వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది. క్యాబేజీ కూర వండేప్పుడు అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. * మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే కేకు మరింత రుచిగా వస్తుంది.
News February 16, 2026
అక్కడ BRS+BJP.. ఇక్కడ BRS+కాంగ్రెస్

TG: కామారెడ్డి మున్సిపాలిటీలో BJPకి చెక్ పెట్టేందుకు INC, BRS ఒక్కటయ్యాయి. ఇక్కడ INC-19, BJP-16, BRS-11, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో INC, BRS పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. మళ్లీ INCలో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికే ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు 2 పార్టీలు అంగీకరించాయి. BRSకు వైస్ ఛైర్మన్(కాసర్ల గోదావరి) పదవి దక్కనుంది. అటు అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి.
News February 16, 2026
‘శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతిపై ఫేక్ వార్తలు నమ్మవద్దు’

శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతిపై ఫేక్ వార్తలు నమ్మవద్దు అని AP FACT CHECK తెలియజేసింది. ‘ఆలయ ప్రాంగణంలో గాలిగోపురం వద్ద<<19154471>> ఒక మహిళ అచేతనంగా పడిఉన్నారనే<<>> సమాచారం మేరకు డ్యూటీ డాక్టర్ అక్కడకు చేరుకొని CPR ఇచ్చారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఎక్కడా వైద్యుల, 108 వాహన నిర్లక్ష్యం లేదు. భక్తులను భయభ్రాంతులకు గురిచేసే తప్పుడు వార్తలు నమ్మవద్దు.’ అని తెలిపింది.


