News December 1, 2025
పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.
Similar News
News February 16, 2026
ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
News February 16, 2026
బిల్ గేట్స్కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.
News February 16, 2026
అమలాపురం: పోలీసు పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు

అమలాపురంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో SP రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 31 దరఖాస్తులు అందాయి. ఈ సమస్యలపై SP సంబంధిత అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.


