News October 6, 2025

ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో ఆయన నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 25, 2026

రథసప్తమి.. తిరుమలలో పటిష్ఠ బందోబస్తు

image

తిరుమలలో శ్రీవారి రథసప్తమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, టీటీడీ సీవీ&ఎస్‌ఓ మురళీకృష్ణ కీలక ప్రాంతాలను పరిశీలించి బందోబస్తును సమీక్షించారు. భారీగా భక్తుల రాక నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పుష్కరిణి వద్ద అదనపు సిబ్బంది, జియో-ట్యాగింగ్ వంటి చర్యలు చేపట్టారు.

News January 25, 2026

సంగారెడ్డి: పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

సంగారెడ్డి జిల్లాలో వివిధ దాడుల్లో పట్టుబడిన అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఈ సరుకును “యథాతథం” పద్ధతిలో విక్రయించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బీవరేజెస్, డిస్టిలరీ సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించారు. ఆసక్తి గల వారు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News January 25, 2026

ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్

image

WPL-2026లో ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు విఫలమైనా లారా(42*), రోడ్రిగ్స్(24), కాప్(19*) రాణించడంతో విజయం సొంతమైంది. ఈ గెలుపుతో DC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో ఆర్సీబీ(10P) ఉంది.