News August 11, 2025

ప్ర‌జా సేవ ప్ర‌యాణం న‌య‌నానందం: కలెక్టర్

image

సర్వేంద్రియానాం నయనం ప్రధానమని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. పటమటలోని అమరావతి ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘నయనం’ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సుసంపన్న, ఆరోగ్య, ఆనంద స్వరాంధ్రప్రదేశ్ సాధనకు సమష్టి కృషి అవసరమన్నారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Similar News

News March 10, 2026

గుడిపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గుడిపల్లి (M) ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ (32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

image

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.

News March 10, 2026

MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

image

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.