News October 4, 2025
ప్రతి భవాని భక్తుడికి 12 లడ్లు: EO

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ప్రతి భవానీ భక్తుడికి 12 లడ్లు అందేలా ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన స్వయంగా లడ్డూ తయారీ కేంద్రం, స్టాక్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో మాట్లాడి, ఆలయం అందిస్తున్న మెరుగైన సేవల గురించి వివరించారు. ఈవో ప్రత్యేక చొరవపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 14, 2026
కేపీఐ డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

కేపీఐ డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి సూచికకు సంబంధించిన సమాచారాన్ని గడువు లోపే ఆన్లైన్ డ్యాష్బోర్డ్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. టైమ్లైన్ పాటించని విభాగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డేటా సక్రమతను తప్పనిసరిగా వెరిఫై చేయాలన్నారు.
News January 14, 2026
రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. 22/ఏ సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, డిజిటల్ సేవలను పూర్తిగా వినియోగించి అమరావతి మండలం, 4 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. డీఆర్ఓ మురళి, డీఐజీ జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News January 14, 2026
రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. 22/ఏ సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, డిజిటల్ సేవలను పూర్తిగా వినియోగించి అమరావతి మండలం, 4 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. డీఆర్ఓ మురళి, డీఐజీ జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


