News November 19, 2025
ప్రధాని మోదీకి పుట్టపర్తిలో ఎమ్మెల్యేల స్వాగతం

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Similar News
News January 19, 2026
కేజీబీవీలకు తాత్కాలిక సారథులు: సీనియర్ టీచర్లు ఇన్ఛార్జీలుగా నియామకం

జనగామ జిల్లాలోని కేజీబీవీ బాధ్యతలను తాత్కాలికంగా సీనియర్ టీచర్లకు అప్పగించారు. జిల్లాలోని స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓ) ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 21 ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అధికారులు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.
News January 19, 2026
సంగారెడ్డి: ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల

జిల్లాలోని 5 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను http://telanganaepass.cgg.gov.inలో ఈనెల 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


