News August 12, 2025

ప్రపంచ ఏనుగుల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో అడవి జంతువులు ముఖ్యపాత్రను పోషిస్తాయన్నారు. అయితే చాలావరకు అడవులు నాశనం అవడంతోనే జంతువులు జనావాసాలలోకి వస్తున్నాయని గుర్తు చేశారు. కాబట్టి అడవులను పెంచి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జంతువులను కాపాడాలన్నారు.

Similar News

News March 6, 2026

గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం!

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ LPG విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేసింది. IOCL, BPCL, HPCLకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రో కెమికల్ రంగాలకు గ్యాస్ సప్లైపై తాత్కాలిక పరిమితులు విధించింది. సాధారణ ప్రజలకు LPG సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 6, 2026

చిత్తూరు SE కీలక ఆదేశాలు

image

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.

News March 6, 2026

బాపట్ల: స్కూల్‌లో అలజడి.. HMపై కులవివక్ష ఆరోపణలు

image

కర్లపాలెం మండలంలోని పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ పట్ల కుల వివక్ష చూపుతున్నారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ వివాదం ముదరడంతో విషయం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.