News December 2, 2025
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైళ్లకు అదనపు బోగీలు

పలు రైళ్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే తాత్కాలికంగా అదనపు బోగీలు జత చేసింది. ప్రయాణికుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని స్లీపర్, AC–3 కోచ్లలో డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటాయని వాల్తేరు రైల్వే కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంబల్పూర్, ఎరోడ్, భువనేశ్వర్, బెంగళూరు, తిరుపతి మార్గాల్లోని రైళ్లలో ఈ ప్రత్యేక సౌకర్యం అందుబాటులో ఉండనునంది.
Similar News
News February 11, 2026
సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

సోషల్ మీడియాలో AI కంటెంట్కు SM ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.
News February 11, 2026
వరుస హత్యలతో సీతంపేటలో ఆందోళన!

MHBD(D) గార్ల మండలం సీతంపేట పరిధిలో గత రెండేళ్లుగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మహేష్ అనే యువకుడి హత్య, అంకన్నగూడెంలో కన్నబిడ్డలకే విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, అత్తను అల్లుడే కరెంట్ షాక్తో చంపడం వంటి ఘటనలు కలకలం రేపాయి. మానవతా విలువలు మంటగలుస్తున్నాయని, ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులు, సామాజిక సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.


