News December 1, 2025

ప్రాజెక్టులను ఆపాలన్న కుట్రలు విఫలమే: సీఎం హెచ్చరిక

image

మక్తల్- NRPT–కొడంగల్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొందరు కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని సీఎం తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టులు ఆగవని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందజేస్తామని, ఏ రైతుకు అన్యాయం జరగనీయమని హామీ ఇచ్చారు. మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధి ఆపొద్దని రైతులను కోరారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు పెద్దపీట వేస్తామన్నారు.

Similar News

News February 17, 2026

సంగారెడ్డి: జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్లు వీరే!

image

సంగారెడ్డి జిల్లాలోని 9 మున్సిపాలిటీల ఛైర్మన్‌లను ఎన్నుకున్నారు. జహీరాబాద్, గడ్డపోతారం ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
నూతన మున్సిపల్ ఛైర్మన్లు
1. సంగారెడ్డి- వనిత
2. సదాశివపేట- అంజమ్మ
3. ఆందోలు జోగిపేట- కృష్ణారెడ్డి
4. నారాయణఖేడ్- నగేశ్ షెట్కార్
5. కోహిర్- అశోక్
6. గడ్డపోతారం- సుష్మ
7. గుమ్మడిదల- కుమార్ గౌడ్
8. ఇస్నాపూర్- సుమలత
9. జిన్నారం- జనార్ధన్

News February 17, 2026

చిత్తూరులో ఘోర విషాదం

image

చిత్తూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు పుదుచ్చేరి బీచ్‌లో మృతి చెందారు. చిత్తూరు రామ్ నగర్‌కి చెందిన జశ్వంత్, జయంత్, నవాజ్, సాదిక్ పుదుచ్చేరి బీచ్‌కి వెళ్లారు. వీరిలో జశ్వంత్, సాదిక్ సముద్రంలోకి దిగి కొంతసేపటికే నీళ్లలో చిక్కుకుని గల్లంతయ్యారు. జాలర్లు వీరి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను చిత్తూరుకు తరలించినట్లు సమాచారం.

News February 17, 2026

JGTL: కాంగ్రెస్‌లో ‘జీవన్’ సెగ.. పార్టీ మార్పు తప్పదా?

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.