News November 21, 2024

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు

image

కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 6, 2026

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు

image

పదో తరగతి హాల్ టికెట్లను విద్యార్థులు వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని DEO ఎల్.సుధాకర్ తెలిపారు. ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ‘మనమిత్ర’ మొబైల్ సంఖ్య 9552300009 నుంచి వీటిని పొందవచ్చన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని హాల్ టికెట్లు సులభంగా పొందేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

News March 6, 2026

కర్నూలు జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు ఇవే

image

కర్నూలు జిల్లాలో ఈనెల 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా తేల్చారు. గార్గేయపురం, వసంత నగర్, ఉలిందకొండ, సి.బెలగల్, దేవనకొండ, ఆస్పరి పరిధిలోని ప్రధాన పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

News March 6, 2026

కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.