News August 13, 2025

ప.గో జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

image

ప.గో.జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడనున్న కారణంగా రానున్న 48 గంటలు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News March 16, 2026

ప.గో: మళ్లీ పాత చోటకే PGRS వేదిక

image

గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి తమ సమస్యల విన్నపానికి నేరుగా SP కార్యాలయానికి రావాలని కోరారు.

News March 16, 2026

ప.గో: సీఆర్పీలకు ఐదు నెలలుగా అందని వేతనాలు

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నియమించిన సీఆర్పీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియామకమై ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగ భద్రతపై అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో గందరగోళం నెలకొందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News March 16, 2026

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.