News November 8, 2025
బండి సంజయ్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ‘దొంగ’ అని సంబోధించడంపై పీసీసీ ఎన్నికల కో కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ గెలిస్తే ఉన్న బంగారం కూడా తీసుకెళ్తారని బండి సంజయ్ జూబ్లిహిల్స్ ప్రచారంలో పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
సిరివెళ్లలో రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

సిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫరూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.
News January 22, 2026
కడప జిల్లాలో పురాతన తెలుగు శాసనం గుర్తింపు

సిద్ధవటం మండలం టక్కోలి గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి, కార్య దర్శి శ్రీనివాసులు తెలిపారు. మాచుపల్లి శ్రీ రేణుకా ఎల్లమాంబ దేవాలయాన్ని దర్శించుకున్న వారు టక్కోలి గ్రామానికి చెందిన శివాలయంన్ని సందర్శించగా అక్కడ ప్రాచీన తెలుగు శాసనం ఉందన్నారు.
News January 22, 2026
ఫీడ్ బ్యాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి: కలెక్టర్

ప్రజలకు అందించే సేవలు నాణ్యతను పెంచేందుకు ఫీడ్ బ్యాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు అమలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ సేవల్లో పారదర్శకత పెంచాలన్నారు. ప్రజల సంతృప్త స్థాయిలను మెరుగుపరచాలన్నారు.


