News October 8, 2024

బతుకమ్మ సంబరాల్లో గొడవ.. ఆర్మీ జవాన్‌పై దాడి

image

ఆర్మీ జవాన్‌పై కత్తితో ఓ వ్యక్తి దాడి చేయడంతో గాయపడిన ఘటన ధరూర్ (M) రేవులపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామంలోని బతుకమ్మ సంబరాలు జరుగుతుండగా.. కృష్ణ అనే వ్యక్తి సౌండ్ గట్టిగా వస్తుందని బంద్ చేయాలంటూ వాదనకు దిగాడు. వారించడానికి వెళ్లిన ఆర్మీ జవాన్‌పై కృష్ణ కత్తితో దాడి చేయగా.. జవాన్ తీవ్రంగా గాయపడడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 8, 2025

ఈనెల 19 నుంచి పిల్లల మర్రి బాలోత్సవాలు

image

ఈనెల 19 నుంచి పిల్లలమర్రి బాలోత్సవాలు నిర్వహిస్తున్నారని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సాంస్కృతిక సాంప్రదాయక నృత్యాలు ,విద్యార్థులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

News December 7, 2025

గల్లంతైన ఆరు గ్యారంటీలు: డీకే అరుణ

image

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టి గెలిచారని మహబూబ్ నగర్ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత వారికి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

News December 7, 2025

MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

image

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.