News December 2, 2025
బయట రాష్ట్రాల ఎర్రచందనం నిల్వలు ఎలా తీసుకొస్తారు..?

శేషాచలం అడవుల నుంచి తరలిపోయిన అరుదైన ఎర్రచందనం అధికారిక లెక్కల ప్రకారం 6 రాష్ట్రాల్లో సుమారు 8వేల టన్నుల నిల్వ ఉంది. ఇందులో కర్ణాటక వేలం వేసుకుందని మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు జీవో కూడా తెచ్చామన్నారు. అయితే ఆ ఆదాయాన్ని ఆ రాష్ట్రాలు వదులుకునే పరిస్థితి లేదట. పవన్ పర్యాటన ముగిసి నెల కావస్తున్న తరుణంలో అధికారులు ఏమి చేసారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
Similar News
News February 16, 2026
నల్గొండ: ఫలించిన ‘గుమ్మల’ నిరీక్షణ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి నిరీక్షణ ఫలించింది. గతంలో పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న ఆయన, తాజాగా జరిగిన నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి తన సతీమణిని కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. డీసీసీ పదవి దక్కకపోయినా, ఈ గెలుపుతో మంత్రి తన రుణం తీర్చుకున్నారని, తమకు తగిన గౌరవం లభించిందని గుమ్ముల దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
News February 16, 2026
వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వేగంగా పూర్తిచేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణాల పథకాల అమలుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలని ఆదేశించారు. నిరుపేద కుటుంబాలకు 100 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.
News February 16, 2026
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: ADB కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.


