News December 2, 2025
బయట రాష్ట్రాల ఎర్రచందనం నిల్వలు ఎలా తీసుకొస్తారు..?

శేషాచలం అడవుల నుంచి తరలిపోయిన అరుదైన ఎర్రచందనం అధికారిక లెక్కల ప్రకారం 6 రాష్ట్రాల్లో సుమారు 8వేల టన్నుల నిల్వ ఉంది. ఇందులో కర్ణాటక వేలం వేసుకుందని మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు జీవో కూడా తెచ్చామన్నారు. అయితే ఆ ఆదాయాన్ని ఆ రాష్ట్రాలు వదులుకునే పరిస్థితి లేదట. పవన్ పర్యాటన ముగిసి నెల కావస్తున్న తరుణంలో అధికారులు ఏమి చేసారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
Similar News
News February 7, 2026
మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
News February 7, 2026
నారాయణపేటలో ‘త్రిముఖ’ పోరు

నారాయణపేట మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ గెలుపు కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మాజీ మంత్రులు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి బృందం వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. ఇక బీఆర్ఎస్ బాధ్యతను మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి భుజాన వేసుకున్నారు. అగ్రనేతల ప్రచారంతో పేటలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.
News February 7, 2026
మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.


