News October 5, 2025

బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని తీర్మానం: వైసీపీ

image

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశంలో తీర్మానించింది. ఆదివారం విశాఖ జిల్లా ఆనందపురం చెన్నా కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, సీనియర్ పార్టీ నాయకుడు వీసం రామకృష్ణ బల్క్ డ్రగ్ పార్క్ విషయాన్ని ప్రస్తావించారు. రిలే దీక్షలు చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ప్రకటించారు.

Similar News

News January 13, 2026

రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మొదట సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఓల్డ్ లుక్‌తో రూఫ్ టాప్ ఫైట్ యాడ్ చేసిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News January 13, 2026

10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.

News January 13, 2026

అన్నమయ్య: మద్యం బాటిల్స్‌పై రూ.10 పెంపు.!

image

అన్నమయ్య జిల్లాలో గతనెల 1,12,282 కేసుల లిక్కర్ (IML), 49,398 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.78.16 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9216 కేసులు లిక్కర్, 3936 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.6.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.