News March 13, 2025

బాపట్ల: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పక్కా గృహాల నిర్మాణం, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.

Similar News

News March 26, 2025

పల్నాడు: మంత్రి పదవి రేసులో యరపతినేని.?

image

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావుకు ప్రాతినిధ్యం కల్పించాలని TDP కార్యకర్తలు బలంగా వాదన వినిపిస్తున్నారు. MLC నాగబాబుకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు విస్తరణ చేపట్టనున్నారు. క్యాబినెట్‌లో పల్నాడుకు ప్రాతినిధ్యం లేదు. గురజాల నుంచి వరుసగా 7 సార్లు పోటీ చేసి TDPలో 3 తరాలతో పనిచేసిన యరపతినేనికి మంత్రి మండలిలో బెర్త్‌పై ప్రచారం జరుగుతోంది.

News March 26, 2025

మంగళగిరి: అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్‌

image

అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీసు స్టేషన్‌లో శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. అఘోరితో కలిసివచ్చి శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు, కేర్‌టేకర్‌ విష్ణుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఇష్ట పూర్వకంగానే అఘోరిగా మారినట్లు శ్రీవర్షిణి తెలిపింది.

News March 26, 2025

పార్వతీపురం నగరపాలక సంస్థ బకాయిదారులకు శుభవార్త

image

పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలం, ఇంటి స్థల పన్నులపై 50 శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిని వన్ టైం సెటిల్మెంట్‌గా భావించి ఏక మొత్తంలో చెల్లించి 50% రాయితీ పొందవచ్చును అన్నారు. ఈనెల 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. సచివాలయాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో పన్నులు చెల్లించి తగు రసీదు పొందాలని సూచించారు.

error: Content is protected !!