News March 15, 2025
బాపట్ల జిల్లాలో ఒంటిపూట బడులు: DEO

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. SSC పరీక్షా కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5గంటల వరకు బడి నిర్వహించాలన్నారు.
Similar News
News February 15, 2026
మహబూబాబాద్లో 144 సెక్షన్: ఎస్పీ

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ (163 BNSS) అమల్లో ఉంటుందని ఎస్పీ డా. శబరిష్ తెలిపారు. నలుగురికి మించి గుంపులుగా తిరగడం, విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
News February 15, 2026
వాలీబాల్ లీగ్ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు ప్రథమ స్థానం

భట్టిప్రోలులో నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల వాలీబాల్ లీగ్ పోటీలు ఆదివారంతో ముగిసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కరీంశెట్టి సుబ్బారావు తెలిపారు. ఆదివారం భట్టిప్రోలు ప్రభుత్వ పాఠశాలలో సుబ్బారావు మాట్లాడారు. ఈ పోటీల్లో 8 టీములు పాల్గొన్నాయన్నారు. కృష్ణాజిల్లా 1వ స్థానం సాధించిందన్నారు. బాపట్ల జిల్లా-2, ప్రకాశం జిల్లా -3, ఎన్టీఆర్ జిల్లా -4వ స్థానంలో నిలిచాయన్నారు.
News February 15, 2026
జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు INDలో ఆశ్రయం కల్పిస్తామని PM మోదీ ప్రకటించారు. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7GW దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు. కాగా రేపు ఢిల్లీలో <<19143850>>ఏఐ సమ్మిట్ను<<>> PM ప్రారంభించనున్నారు.


