News April 2, 2024

బాపట్ల: ట్రాన్స్ జెండర్ గొంతు కోసిన ఆగంతుకుడు

image

చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ కొల్లూరులోని ఓ దుకాణం వద్ద చందా తీసుకుంటుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆగంతుకుడు ఆమె వెనుకగా వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె బయపడి అతని చెంపపై కొట్టింది. దీంతో అతడు పదునైన ఆయుధంతో గొంతుపై గాయం చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 10, 2026

అమరావతి అనుసంధానంగా నాలుగు వరుసల ROB

image

రాజధాని అమరావతి అనుసంధానంగా మంగళగిరి పట్టణంలో నిడమర్రు రైల్వే గేట్ వద్ద నాలుగు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.90.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును18 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రద్దీ తగ్గించి, అమరావతి ప్రాంతానికి వేగవంతమైన రాకపోకలకు ఇది దోహదం చేయనుంది.

News February 10, 2026

GNT: మందగించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

image

ప్రభుత్వ పథకాల లక్ష్యంతో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మందగించింది. గుంటూరులో 52.2%, బాపట్లలో 53.4%, పల్నాడులో 36.9 శాతం నమోదు పూర్తైంది. ప్రశ్నావళిలో అడిగే వివరాలకు ప్రజలు సమాధానాలు ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారు. ఆధారాలు చూపేందుకు నిరాకరిస్తున్నారు. సిబ్బంది ఇళ్లకు వెళ్లినా చాలామంది నివాసం లేనివారిగా తేలుతున్నారు. దీంతో లక్షల్లో పౌరుల చిరునామాలు లభించని పరిస్థితి.

News February 10, 2026

GNT: శైవక్షేత్రాలకు అదనపు ఆర్టీసీ బస్సులు

image

శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం RTC విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. గుంటూరు–1, గుంటూరు–2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచే శ్రీశైలానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. కోటప్పకొండకు గుంటూరు నుంచి 90, క్వారీ 38, గోవాడకు 34 బస్సులు ఏర్పాటు చేశారు.