News November 5, 2025
బాపట్ల: మద్యం తాగి బస్సు నడుపిన డ్రైవర్

బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు మార్టూరు సీఐ శేషగిరిరావు, రవాణాశాఖ అధికారులు NH–16పై మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అతివేగంగా వస్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ను తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్ను తనిఖీ చేయకుండా పంపిన మేనేజర్, కెప్టెన్లపై కూడా చర్యలు చేపట్టారు.
Similar News
News January 19, 2026
KMR: అభ్యర్థుల ఎంపికకు కసరత్తు

మరో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులకు వ్యక్తిగతంగా బరిలో నిలిచేందుకు సూచించగా, అధికారికంగా జాబితాను ప్రకటించనుంది. కాంగ్రెస్, BRS పార్టీలు ఎలాగైనా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి గట్టి పోటీనిచ్చే అభ్యర్థుల ఎంపికకు ముమ్మర ప్రయత్నం చేస్తోంది.
News January 19, 2026
న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

న్యూజిలాండ్తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.
News January 19, 2026
అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.


