News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు: DSP

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 23, 2026
సంగారెడ్డి: ‘మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు’

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుండగా ఓటరు జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News January 23, 2026
SRPT: లక్ష్య సాధనే ధ్యేయంగా చదవాలి: డీఐఈఓ భాను

విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భాను పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో చదివి కళాశాలకు పేరు తేవాలన్నారు. మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని, వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.


