News April 13, 2024
బాలకృష్ణ నేటి పర్యటన షెడ్యూల్

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టనున్నారు. కదిరిలో ఉదయం 9:30 గంటలకు ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పూజలు చేయనున్నారు. 11.30 గంటలకు దర్గాలో ప్రార్థనలు, 3 గంటలకు జమ్మిమాను సర్కిల్లో ప్రసంగం ఉంటుంది. 5.30 గంటలకు కదిరి నుంచి కొత్తచెరువు మీదుగా పుట్టపర్తికి చేరుకుని 6.30 గంటలకు ప్రసంగించనున్నారు.
Similar News
News December 15, 2025
అనంతపురం జిల్లా TDP నేత మృతి

అనంతపురం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, రాయదుర్గం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.లోకానంద సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన లోకానంద లీగల్ సెల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News December 15, 2025
కేఎల్ స్వామి దాస్కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.
News December 15, 2025
కేఎల్ స్వామి దాస్కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.


